YS Jagan : ఎన్నికల నిబంధనల election code ఉల్లంఘన కేసులో ఏపి సీఎం ap cm వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy కి పూర్తిగా ఊరట లభించనున్నది. 2014 ఎన్నికల సందర్భంలో హైదరాబాదు Hyserabad – విజయవాడ vijayavada జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా ర్యాలీ Rally నిర్వహించారన్న అభియోగంపై కోదాడ kodada పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1 గా వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏ 2 గా నాగిరెడ్డి, ఏ 3 గా వైవి రత్నం బాబులు ఉన్నారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో ఇంతకు ముందే నాగిరెడ్డి, వైవి రత్నంలపై అబియోగాలు నిరూపణ కాకపోవడంతో కోర్టు వారిపై కేసు కొ్ట్టేసింది. ఈ నేపథ్యంలో ఏ 1 గా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి కోర్టుకు హజరు కావాలని నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కేసులు విచారించే కోర్టు ఈ నెల 12వ తేదీ హజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. అయితే జగన్ కోర్టుకు విచారణకు హజరు కాలేదు.
YS Jagan : కేసు ఉప సంహరణకు పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
అయితే ఈ సందర్భంలో కోదాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జగన్మోహనరెడ్డికి సమన్లు పంపలేదని తెలియజేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిపై నమోదు అయిన అభియోగాలు నిరూపణ కానందున కోర్టు కేసు కొట్టేసిందని చెప్పారు. కావున జగన్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయమూర్తి… ఈ కేసు ఉపసంహరణకు గానూ నాడు ఫిర్యాదు చేసిన ఎంపిడీఓ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిని కోర్టుకు హజరుపర్చాలని పోలీసులకు ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. పోలీసులే కేసు ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసినందున జగన్మోహనరెడ్డిపై నమోదు అయిన ఈ ఎలక్షన్ కేసు తొలగిపోనున్నది.