ఒకప్పుడు పిల్లలు సమయం దొరికినప్పుడల్లా పక్కింటివారితోనో, స్నేహితులతోనో కలిసి ఆడేవారు. అప్పటిలో పిల్లలకు ఆ ఆటలే కాలక్షేపం. ఆలా ఆడుకున్న పిల్లలు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. ఇది తల్లితండ్రులుగా మీరు ఎప్పుడైనా గమనించారా?
ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ పిల్లలు స్మార్ట్ఫోన్స్ల తోనే కాలక్షేపం చేస్తున్నారు. అందులోనే గేమ్స్ ఆడుతూ కాలం గడుపుతున్నారు. దీంతో మా పిల్లలు చాలా స్మార్ట్ ఆ వయసులో మాకు ఎం తెలియదు అంటూ పేరెంట్స్ మురిసిపోతున్నారు.. కానీ, ఇది మీ పిల్లల మీద కొత్త జబ్బులతో దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
స్మార్ట్ ఫోన్స్ వలన పిల్లలకు మానసిక సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. పిల్లలకు వారి ఫస్ట్ ఆప్షన్ స్మార్ట్ ఫోన్ అయిపోయింది ఈ మధ్య. అందులో గేమ్స్, వీడియోస్ అంటూ ఓపెన్ చేసి అదో కిడ్స్ జోన్లా ఫీలై పోయి అందులో గంటలు గంటలు ఉండిపోతున్నారు. ఇది అంత పేరెంట్స్ చూసి తమ పిల్లలు గ్రేట్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ల ఏదో ఆడుకుంటున్నారు, వాళ్ళ లోకంలో వాళ్లు ఉంటున్నారని ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ.. ఈ అలవాటు పిల్లల మానసిక విజ్ఞానాన్ని దెబ్బతీస్తుందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. వారిలో కొత్త విషయాలని తెలుసుకోవాలన్న ఆశ లేకుండా చేస్తుందని చాలా కచ్చితంగా చెబుతున్నారు.
ఫోన్ చూస్తున్నంత సేపు ఇలా కదలకుండా ఒకేచోట కూర్చుని ఉండడం వల్ల వారి నరాలు బిగుసుకుపోయి భవిష్యత్లో ఏ పనిచేయడానికి అవి సహకరించవని డాక్టర్స్ చెబుతున్నారు. మెడనరాలు బిగుసుకుపోయి వెన్నుపూసపై భారంపడి ఎముకలు త్వరగా అరిగిపోతున్నట్లు వారు గమనించారు. ఏది ఎంతవరకూ వాడాలో అంతవరకూ వాడితేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్థమే. రోజులో 24గంటల్లో ఫోన్ కి అరగంట కేటాయిస్తే పర్లేదు కానీ.. అదేపనిగా సెల్ఫోన్ వాడడం వల్ల పిల్లలు మానసికంగా ఎదగరని అధ్యాయనాలు చెబుతున్నాయి.