అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంజిఆర్ను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సూచించారు. తాజాగా పరుచూరి పలుకులు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ పవన్ కళ్యాణ్ మేకప్కు దూరంగా ఉండడం సరి కాదని సూచించారు. ఒక వైపు రాజకీయ కార్యక్రమాలు చక్కబెడుతూనే మరో వైపు సినిమాలు చేయాలని పరుచూరి సూచించారు. ఈ విషయంలో ఎంజిఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని పరుచూరి అన్నారు.
ఒక సాధారణ వ్యక్తి ఇంటింటికీ తిరిగి చెప్పే ఒక మాటను ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో చెబితే సరిపోతుందనీ, ఆర్టిస్ట్ చేసుకున్న అదృష్టం అది అని పరుచూరి అన్నారు. ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ సామాజిక సమస్యలపై స్పందించే కథాంశాలను ఎంచుకొని ప్రజలను ఉత్తేజపరుస్తూ వెళితే బాగుంటుందని పరుచూరి పేర్కొన్నారు.