Pattabhi : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి Pattabhi పై ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై అదేవిధంగా ముఖ్యమంత్రిపై భారీ స్థాయిలో డైలాగులు వేయడం జరిగింది. జరిగిన ఘటనలో పట్టాభి కారు అద్దాల తోపాటు సెల్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనపై వడ్లు అదేవిధంగా కర్రలతో దుండగులు దాడికి పాల్పడినట్లు పట్టాభి చెప్పుకొచ్చారు. దాదాపు పదిహేను మంది తన వాహనం పై దాడికి పాల్పడ్డారని పది రోజుల క్రితం నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రభుత్వ అవినీతిని బయటపెడతానని నాపై దాడి చేయడం జరిగిందని పట్టాభి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పథకం ప్రకారం హత్య చేయాలని కుట్ర పన్నినట్లు కూడా పట్టాభి వ్యాఖ్యానించారు.
పైగా వివిఐపిలు తిరిగే ప్రదేశాలు అల్లరిమూకలు విజృంభించాయి అని, అటువంటి ప్రదేశాలలో తన పై దాడి చేస్తే పోలీసులు చేతులు దులుపుకున్నారు, పెద్దగా స్పందించలేదు అన్నట్టు అనుమానిత వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇది కావాలని టిడిపి నేతలు ఆడుతున్న డ్రామా అని వైసీపీ పార్టీకి చెందిన మద్దతుదారులు అంటున్నారు. పట్టాభి పై దాడి జరుగుతుందని తనకు ముందే తెలిసింది అంటూ ప్రముఖ టీవీ ఛానల్లో ఆయన భార్య కామెంట్లు చేయటం దేనికి సంకేతమని తాజాగా జరిగిన ఘటనపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇదంతా ఒక పథకం ప్రకారం టిడిపి నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు విఘాతం కలిగించడానికి ఆడుతున్న డ్రామా అని, ప్రభుత్వంపై బురద చల్లడానికి చంద్రబాబు, పట్టాభి వేస్తున్న సరికొత్త ఎత్తుగడ అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తనపై దాడి జరుగుతోందని పట్టాభి ముందే తన భార్యకు చెప్పడం ఆ తర్వాత దాడి జరగడం, పైగా పెద్దగా దెబ్బలు కూడా ఎక్కడ తాకినట్లు కనబడకపోవడం.. బట్టి చూస్తుంటే సామాన్యులకి కూడా ఇదంతా ఒక డ్రామా లాగే ఉందన్న అభిప్రాయం నెలకొంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన వారిని కొంతమందిని పోలీసులు గుర్తించినట్లు అదుపులోకి తీసుకున్నట్లు దాడి జరిగిన ప్రాంతంలో సంబంధించిన సీసీ కెమెరా లో బయటపడ్డ వీడియోలు ఆధారంగా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read ==> జగన్ ప్రధాని అయితే — బీజేపీ నుంచి కీలక కామెంట్ వచ్చింది మిస్ అవ్వకండి !