YS Jagan : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ BJP నేతలు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy, వైసీపీ ycp ఎంపీ MP లు తరచు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతున్నారు. నిన్న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala sitaraman 2021- 22 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం పట్ల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు..కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు భారీగా నిధుల కేటాయింపులు చేసిన ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని విమర్శిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా తదితర విషయాల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులలో ఆంధ్రకు అన్యాయం జరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి vijaya sai reddy అన్నారు. ఏపికి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. పోలవరం Polavaram ప్రాజెక్టు గానీ, మరే ఇతర పథకాలకు గానీ నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కశ్చితంగా ప్రకటించాల్సిందేనని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలపై బీజెపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి sujana chowdary స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక వేళ ప్రధాన మంత్రి అయినా ఏపికి ప్రత్యేక హోదా సాధించలేరని అన్నారు సుజనా చౌదరి. జగన్ ఢిల్లీ వచ్చి ఏమి చేస్తున్నారో ఏమీ తెలియడం లేదని అన్నారు. జగన్ ఢిల్లీకి వచ్చి కేంద్ర పెద్దలను కలుస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనీ, సొంత కేసులు, సొంత వ్యవహారాల కోసమని విమర్శించారు సుజనా చౌదరి. ఎన్నికల బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు అవసరం లేదని, దానికి కేంద్రం నిధులు వేరుగా ఇస్తుందని సుజనా చౌదరి అన్నారు.