Prabhas Adipurush : ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈరోజున తొలి రోజు షూటింగ్ మొదలు పెట్టారు. ప్రసాద్ సుతార్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రామాయణ ఇతిహాసం మూలకథ గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది.
కొద్ది సేపటి క్రితం ముంబైలోని గుర్గాన్ లక్ష్మి పార్క్ స్టూడియో లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడియోలో పలు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో అక్కడే ‘ఆదిపురుష్’ మొదటి రోజు షూటింగ్ సెట్ కూడా వేశారని చెబుతున్నారు. ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్సైట్ ప్రకారం రెండు గంటలు ఆ సెట్ లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత స్టూడియో లో చెలరేగిన మంట ఈ సెట్ కి కూడా అంటుకుందట.
అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ మంటను ఆర్పేశారు అని చెబుతున్నారు. కానీ సెట్ మాత్రం పూర్తిగా తగలబడింది అని వార్తలు బయటకు వచ్చాయి. ఇక బాలీవుడ్ మీడియా వారు అయితే మొదటి రోజే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మొదటిరోజు షూటింగ్ కోసం నిర్మించిన భారీ సెట్ ఇలా అగ్నిప్రమాదం వల్ల నాశనం కావడం అనేది నిజంగా నిర్మాతలకు పెద్ద నష్టమే.
ప్రస్తుతానికైతే షూటింగ్ లో ఉన్న నటీనటులకు సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని చెబుతున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని మీద నడిచే ఈ చిత్రం మొదటి రోజే ఈ ఇటువంటి యాక్సిడెంట్ జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. అయితే చిత్ర యూనిట్ నుండి ఇప్పటికి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ముంబైలోని మీడియా వారు, ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్సైట్ మాత్రం షూటింగ్ కోసం వేసిన సెట్ పూర్తిగా కాలిపోయింది అని తెలిపారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!