Janasena : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడే తను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని… తనకు ఎటువంటి కులాలను అంటగట్టవద్దని…. కులరహిత రాజకీయాలు చేస్తానని చెప్పారు. అత్యంత వీరావేశంతో పార్టీ స్థాపించిన అతను తనని తాను అభినవ రాజకీయ నేతగా చెప్పుకున్నారు. అయితే తనకు ఏ కులము…. మతము లేదని చెప్పిన ఆయన తనకి కులం అనే రాటను కట్టేస్తారా? సంకుచితంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రతిపక్షం పై కూడా చాలా సార్లు విరుచుకుపడ్డారు.
కాపులే కాపాడారు
అయితే పవన్ తనకు ఏ కులం అయితే వద్దు అన్నారో వారి అతనిని నెత్తిన పెట్టుకున్నారు. ఆ సామాజికవర్గం ఇప్పుడు పవన్ పార్టీని పంచాయతీ ఎన్నికల్లో తమ భుజాలపై మోసింది. జనసేన పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఇంతగా రాణించడానికి ఆ పార్టీ పరువు నిలబడడానికి కారణం కేవలం కాపు సామాజిక వర్గం అన్నది మాత్రం వాస్తవం. దీనికి ప్రత్యేక ప్రత్యేక ఉదాహరణ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.
అంతా వారి చలవే…
కాపులు ఎక్కువగా ఉండే తూర్పుగోదావరిలో తన పార్టీ మద్దతుదారులు గా ఉండి గెలిచిన వారికి సన్మానం చేయడమే కాకుండా ఎంత కాదనుకున్నా పవన్ కు కాపుల అండ చాలా అవసరం అని పరోక్షంగా అంగీకరించినట్లు అయింది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం మొత్తం మరో పార్టీ లేదన్నట్లు జనసేన వైపు నిలబడింది. నెల్లూరు సహా గోదావరి. కృష్ణా జిల్లాల్లో కూడా జనసేన మద్దతుదారులు వీరి వల్లే విజయం సాధించారు.
పవన్ కూ అవసరమే….
పంచాయతీ ఎన్నికలపై అసలు జనసేన అంతగా ఆశలు పెట్టుకోలేదు కానీ నాలుగు దశల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను విశ్లేషిస్తే జనసేనను గెలిపించింది కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కావడం విశేషం. అయితే ఇప్పుడు కాపులను ఎంతైనా ఓన్ చేసుకోవాల్సిన అవసరం పవన్ కు ఏర్పడింది. తన రాజకీయ జీవితంలో కీలకమైన దశ మొదలైన నేపథ్యంలో అతనికి వారి అవసరం ఎప్పుడూ ఉంటుంది. వారు కూడా అతని అవునన్నా.కాదన్న తమ నాయకుడిగా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.
మరి పవన్ నిర్ణయం ఏంటి?
గత ఎన్నికల పరిస్థితి ఎలా ఉన్నా…. ఇప్పుడు మాత్రం కాపులు ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టిడిపి వైపు వెళ్లేది లేదని… జనసేన పై నమ్మకం పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించుకున్న వారు… ఇప్పుడు పంచాయితీ ఎన్నికల పరిస్థితిని చూస్తే వారిని కూడా పక్కన పెట్టినట్లు స్పష్టం అవుతోంది. కాబట్టి ఎలా చూసుకున్నా కాపులంతా జనసేన వైపే…. మరి పవన్ వైపు నిలబడతారా…. లేదా… అనేది చూడాలి.