Thomas Cup: థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బాడ్మింటన్ బృందానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా టీమ్ కు ఫోన్ చేసి అభినందలు తెలియజేశారు. భారత్ ను విజేతగా నిలిపి 135 కోట్ల మంది భారతీయులకు గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా వారితో అన్నారు. దాదాపు పది నిమిషాల సేపు మోడీ క్రీడాకారులతో మాట్లాడారు. ఈ వీడియోను స్వయంగా మోడీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Thomas Cup: ఇదో చారిత్రక ఘట్టం
భారత బాడ్మింటన్ లో ఇదో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు ఏపి సీఎం వైఎస్ జగన్. బాడ్మింటన్ లో 73 ఏళ్ల భారత భారత కలను సాకారం చేసినందుకు గానూ కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్ ను ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ అభినందించారు. ఫైనల్ లో జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్ ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
కాగా భారత షట్టర్లు పురుషుల బాడ్మింటన్ లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బాడ్మింటన్ జట్టు తొలి సారి స్వర్ణ పతకాన్ని కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 14 సార్లు ఛాంపియన్ గా ఉన్న ఇండోనేషియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని భారత్ టీమ్ చేజిక్కించుకుంది.
A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup!
Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2022
A special interaction with our badminton 🏸 champions, who have won the Thomas Cup and made 135 crore Indians proud. pic.twitter.com/KdRYVscDAK
— Narendra Modi (@narendramodi) May 15, 2022