YSRCP Rajya Sabha: ఏపిలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ షెడ్యుల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్న నేపథ్యంలో చాలా కాలంగా ఒక స్థానం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీ కుటుంబానికి జగన్ కన్ఫర్మ్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ నుండి ఎవరూ ఖండించలేదు. ఇంతకు ముందు అంబానీ సిఫార్సు మేరకు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చిన నేపథ్యంలో ఈ సారి గౌతమ్ ఆదానీ సతీమణి ప్రీతి అదానీ లేక ఆయన కుమారుడికి వైసీపీ రాజ్యసభ ఇవ్వనుందని ప్రచారం జరిగింది. అదే విధంగా విజయసాయి రెడ్డికి మరో సారి అవకాశం ఇవ్వనున్నారనీ, బీసీ సామాజికవర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు, కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణిల పేర్లు దాదాపు ఖరారు అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP Rajya Sabha: ఆదానీ ఫ్యామిలీకి ఆసక్తి లేదు
అయితే ఆదానీ ఫ్యామిలీ రాజ్యసభ రేసులో లేరని స్పష్టం అయ్యింది. మీడియాలో వస్తున్న కథనాలను ఆదానీ గ్రూపు ఖండించింది. మీడియాలో కథనాలపై ఆదానీ గ్రూపు ట్విట్టర్ వేదికగా స్పందించింది. గౌతమ్ ఆదానీ గానీ ఆయన భార్య ప్రీతి అదానీ గానీ ఎలాంటి రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని వారికి రాజకీయ ఆసక్తి లేదని అదానీ గ్రూపు అధికారికంగా ప్రకటించింది. ఆదానీ కుటుంబం నుండి ఇద్దరిలో ఒకరు రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ వస్తున్న ప్రచారం అవాస్తమని ప్రకటించింది. ఆదానీ ఫ్యామిలీ రాజ్యసభలో లేరని స్పష్టం అవ్వడంతో ఆ ఒక్క సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆ ఒక్కటీ మైనార్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గ నేతకే కన్ఫర్మ్..?
ఇప్పటికే ఇద్దరు బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గానికి కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతుండగా మిగిలిన ఒకటి ఎస్సీ, లేదా మైనార్టీలకు అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఏపి సీఎం వైఎస్ జగన్.. సినీనటుడు ఆలీకి ఓ నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైనార్టీ కోటా నుండి ఆయనకు అవకాశం ఇస్తారా లేక పార్టీలో ఎస్సీ నేతల్లో ఒకరికి అవకాశం ఇస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ నుండి జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపుగా రాజ్యసభ అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Media Statement on false news about Rajya Sabha Seat pic.twitter.com/GK4y3uIWGL
— Adani Group (@AdaniOnline) May 14, 2022