PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహజంగా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత వేషధారణలో కనిపిస్తూ కనువిందు చేస్తుంటారు. మంగళవారం పూణెలో ప్రధాన మంత్రి మోడీ కొత్త గెటప్ లో కనువిందు చేయడంతో పాటు తంబూర చేబూని చిడతలు వాయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పూణెలో పర్యటించారు. అక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
17వ శతాబ్దికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆక్కడి సంప్రదాయ వస్త్రధారణ ప్రకారం మోడీ తలపాగా చుట్టారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీకి ఆలయ పాలకమండలి సభ్యులు తుంబుర, చిడతలు బహుకరించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ తుంబుర చేబూని చిడతలు వాయించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లఖించారు. అనేక కీర్తనలు రచించారు. ఆయన మరణానంతరం అక్కడ చిన్న మందిరం ఏర్పాటు చేశారు. ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు.
#WATCH | Prime Minister Narendra Modi offered prayers to Sant Tukaram Maharaj at Sant Tukaram temple in Dehu, Pune today.
(Source: DD) pic.twitter.com/r7a468F2Q9
— ANI (@ANI) June 14, 2022