శాంతి కి ప్రతి రూపం గా నిల్చిన జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర జీ మహారాజ్ 151 జయంతి ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, నవంబర్ 16 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియోకాన్ఫరెన్సు ద్వారా “శాంతి విగ్రహాన్ని” ఆవిష్కరించనున్నారు. రాజస్థాన్ పాలి జిల్లాలో జేత్పురాలోని విజయ్వల్లబ్ సాధన కేంద్రలో ఏర్పాటు చేయనున్నారు. శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహరాజ్ గౌరవార్ధం ఆవిష్కరించనున్న విగ్రహానికి “శాంతి విగ్రహంగా” పేరుపెట్టారు. 151 అంగుళాల పొడవైన ఈ విగ్రహాన్ని అష్ఠధాతువులతో అంటే 8 రకాల లోహాలతో తయారు చేశారు. ఇందులో ప్రధానలోహం రాగి.
శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జి మహరాజ్ 20 వ శతాబ్దపు ప్రసిద్ధ జైన సాధువు. అతన్ని పంజాబ్ కేసరి అని కూడా పిలుస్తారు. ఆయన గుజరాత్లోని బరోడాలో 1870 కార్తీక్ షుడి దూజ్ (భాయ్ దూజ్) లో జన్మించాడు. అతని తండ్రి శ్రీ దీప్ చంద్, తల్లి పేరు శ్రీమతి ఇచ్చా బాయి. అతని అసలు పేరు చాగన్ లాల్.1944 లో రాధన్పూర్ లో దీక్ష సంవత్ ను అతని దీక్ష గురు శ్రీ హర్ష్ విజయ్ జీ మహారాజ్ నుండి తీసుకున్నారు. ఆ తరువాత లాహోర్లోని సంవత్ 1981 లో ఆచార్య పదవి పొందాడు. అతను జైన సాధువుగా ఎంతో నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆయన నిస్వార్ధతతో తన జీవితాన్ని భగవాన్ మహావీరుడి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు అంకితం చేశారు. ఆయన సామాన్యుల సంక్షేమం, విద్యా వ్యాప్తి, సామాజిక దురాచారాల నిర్మూలన కోసం నిరంతరం కృషి చేయడంతోపాటు కవిత్వం, వ్యాసాలు, భక్తిగీతాలు,స్తవనాల వంటి ప్రేరణాత్మక రచనలు చేశారు.అతను ఉత్తర భారతదేశం అంతటా అన్ని ఆత్మానంద జైన సభల స్థాపకుడిగా పిలువబడ్డాడు. అతను అనేక జైన దేవాలయాలను కూడా స్థాపించాడు. ఆచార్య విజయానంద్ సూరి పేరిట అనేక బోధనా సంస్థలను స్థాపించారు. స్వదేశీ కోసం పనిచేశారు. స్వాతంత్ర ఉద్యమానికి క్రియాశీల మద్దతునిచ్చారు . వారి ప్రేరణతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 50 ప్రముఖ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. వీటిలో కళాశాలలు, పాఠశాలలు, అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఆయన 1954 లో మరణించారు.