హైదరాబాదు, మార్చి 3: డెటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ సిఇఒ అశోక్కు 161 సిఆర్పిసి కింద విచారణకు హజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నలుగురు ఐటి గ్రిడ్ ఉద్యోగులను నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు.
తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పి ఎవరో తీసుకువెళ్లారని సంస్థ సిఇఒ అశోక్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఐటి గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఎపి పోలీసులు తనను బెదిరిస్తున్నారంటూ ఆదివారం సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
టిడిపికి సేవలు అందిస్తున్న మదాపూర్లోని ఐటి కంపెనీలో తెలంగాణ పోలీసులు నిన్న సాయంత్రం సోదాలు నిర్వహించారు.