రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు అందరికీ అందనంత ఎత్తులో ఉంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్, అక్కడినుండి ఆ ఇమేజ్ నే మరింత బాగా నిర్మించుకుంటున్నాడు. బాహుబలి తర్వాత చేసిన సాహో సౌత్ లో ప్లాప్ అయినా, నార్త్ లో మాత్రం మంచి హిట్ గా నిలిచింది.
సాహో హిందీలో 100 కోట్ల పైన కలెక్షన్ ను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 2 ఏళ్ళు తీసుకుంటున్నాడు. ప్రభాస్ తర్వాతి చిత్రం రాధే శ్యామ్ 2018లో మొదలవ్వగా ఇప్పటికి ఇంకా పూర్తవ్వలేదు. అయితే దీనికి కరోనా కూడా కొంత కారణమైంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అతి త్వరలో ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను తిరిగి ప్రారంభించుకోనుందని తెలుస్తోంది.
ఈ సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాధే శ్యామ్ పూర్తవ్వగానే ప్రభాస్ మొదలుపెట్టే సినిమాపై ఇన్నాళ్లూ ఒక క్లారిటీ ఉండేది. అయితే రీసెంట్ గా ఈ విషయంలో కన్ఫ్యూజన్ మొదలైంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకూ ముందుగా ఆది పురుష్ సినిమా షూటింగ్ ను మొదలుపెడతాడని భావించారు. అయితే పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేస్తాడని ప్లాన్.
అయితే ఇప్పుడు ప్లాన్ లో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తాడని గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. అది కూడా ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాల కంటే ముందుగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మాస్ మసాలా సినిమాను చేస్తాడని అన్నారు. 2021 సమ్మర్ లో ఆ సినిమా విడుదలైపోతుందని, దాని తర్వాత ఆది పురుష్ కోసం 60 రోజులు పని చేసి, నాగ్ అశ్విన్ చిత్రాన్ని 2021 ఎండ్ నుండి మొదలుపెడతాడని తెలుస్తోంది. ఈ సినిమాలు అన్నీ విడుదలయ్యేసరికి కచ్చితంగా 2023 పడుతుంది కాబట్టి అప్పటిదాకా మరో సినిమా గురించి అడగొద్దు అంటున్నాడు ప్రభాస్.