pulse polio effect : గత ఆదివారం 31 జనవరి 2021 న దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరిగిన సంగతి అందరికి తెలిసిందే.. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బన్ బోరా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసినట్టు అధికారుల విచారణలో తేలింది.. దీంతో వెంటనే సదరు ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.. ప్రస్తుతం ఆ పిల్లలు హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది..
పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా ఆదివారం బన్ బోరా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు 12 మంది పిల్లలకు మధ్యాహ్నం తరువాత వాంతులయ్యాయి. భాదితులు ఆరోగ్య కేంద్రానికి వచ్చి పిల్లల అస్వస్థత గురించి తెలిపారు. తమ ఇద్దరు పిల్లలకు వాంతులు అవుతున్నాయని తండ్రి కిషన్ రావు స్థానిక వైద్యుడి కి ఆశ్రయించగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. మొదట తమ తప్పు లేదంటూ ఒక్కో సీసాలో 40 మందికి సరిపడే చుక్కలు ఉంటాయి. వారికీ రాని సమస్య మీకు వచ్చింద అంటూ ఎదురు బదులిచ్చారు.. స్థానిక ప్రజాప్రతినిధి, ఆ ఏరియా ఆసుపత్రి వైద్యుడు రంగంలోకి దిగడంతో పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసినట్టు పరిశీలనలో తేలింది. వెంటనే ఆ పిల్లలను యావత్మాల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మొదట ఆందోళనకరంగా ఉన్న ఇప్పుడు పిల్లలు కోలుకుంటున్నారని తెలిపారు.
ఈ సంఘటన పై యావత్మాల్ జడ్పి సీఈఓ శ్రీకృష్ణ పంచాల్ సదరు ముగ్గురు సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే సస్పెండ్ చేశారు. వైద్యుడి పై శాఖా పరమైన చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ కు లేఖ రాసినట్టు తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను యావత్మాల్ జిల్లా కలెక్టర్ ఎండీ సింగ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.