Panjab: పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. వ్యక్తిగత కారణాలు, కమిట్ మెంట్ల వల్ల రాజీనామా చేస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు పురోహిత్.
పంజాబ్ గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి చేసినన రాజీనామాను ఆమోదించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. గవర్నర్ పురోహిత్ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమైయ్యారు. అమిత్ షా ను కలిసిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో గవర్నర్ పురోహిత్ కు గత కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని కూడా ఇటీవల సీఎంకు గవర్నర్ పురోహిత్ లేఖ కూడా రాశారు. ఈ లేఖపై సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్రంగా స్పందించారు. శాంతి ప్రేమికులను గవర్నర్ బెదిరించారని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు సీఎం భగవంత్ మాన్. పంజాబ్ లో ప్రభుత్వానికి, గవర్నర్ మద్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
YSRCP: టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ..?