(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెలుపొందారు. రాహుల్ ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఆయన అక్కడ వెనుకంజలో ఉన్నారు. అమేఠీలో బిజెపి తరపున పోటీ చేసిన స్మృతి ఇరానీ ఆధిక్యతలో ఉన్నారు. 2014 ఎన్నికలలో ఆమె రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆమెను రాజ్యసభకు గెలిపించి మంత్రివర్గంలోలోకి తీసుకున్నారు. అప్పటినుంచీ స్మృతి తరచూ అమేఠీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు.