అమరావతి: భారీ విజయం దిశగా దుసుకువెళుతున్న వైసిపి నేత వైఎస్ జగన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
వైసిపి అధినేత వైఎస్ జగ్న్మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికలలో వైసిపి సృష్టించిన ప్రభంజనం చూసి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రాతా ఏర్పాట్లు చేశారు.
వైసిపి శాసనసభ్యులు 25వ తేదీన సమావేశమై లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా జగన్ను లాంఛనప్రాయంగా ఎన్నుకుంటారు. తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు గవర్నర్ను కలుస్తారు. గవర్నర్ ఆహ్వానం మేరకు 30 తేదీన ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా జగన్కు స్వామీ స్వరూపానందేంద్ర సూచించినట్లు చెబుతున్నారు.