అమరావతి: రాష్ట్రంలోని మూడు జిల్లాలలో అధికార తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాలలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
2014 ఎన్నికల్లో నెల్లూరులో మూడు, కడపలో ఒకటి, విజయనగరంలో ఆరు ఎమ్మెల్యే స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది.
ఈ ఎన్నికల్లో వైసిపి ప్రభంజంతో టిడిపి ఈ మూడు జిల్లాలలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు దాపురించాయి.