హైదరాబాదు: గత అసెంబ్లీ ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బలు తిన్న తెలంగాణ కాంగ్రేస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఉనికిని చాటుకుంది. అధికార టిఆర్ఎస్ను ఢీకొని మూడు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకోవడం ఆ పార్టీకి జీవం పోసినట్లు అయ్యింది.
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి సమీప ప్రత్యర్థి రాజశేఖరరెడ్డి (టిఆర్ఎస్)పై 6270ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నల్లగొండ నుండి ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు విజయం సాధించారు.
టిఆర్ఎస్ తొమ్మిది లోక్సభ స్థానాలను కైవసం చేసుకోగా బిజెపి నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించాయి.
తెలంగాణలో విజయం సాధించిన లోక్సభ అభ్యర్థులు..
1.హైదరాబాద్ : ఆసిదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)
బిజెపి విజేతలు
1. సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి
2. ఆదిలాబాద్: యం బాబురావు
3.కరీంనగర్: బండి సంజయ్బి
4. నిజామాబాద్ : అరవింద్
కాంగ్రెస్ విజేతలు
1. నల్గొండ: ఉత్తమ్ కుమార్
2 మల్కాజిగిరి : రేవంత్ రెడ్డి
3. భువనగిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
టిఆర్ఎస్ విజేతలు
1. జహీరాబాద్: బిబి పాటిల్
2. వరంగల్: పసునూరి దయాకర్
3. మహబూబ్ నగర్ : మన్నే శ్రీనివాస రెడ్డి
4. ఖమ్మం: నామ నాగేశ్వర్ రావు
5. మహబూబ్ బాద్: మాలోత్ కవిత
6. మెదక్: కొత్త ప్రభాకర్ రెడ్డి
7. నాగర్ కర్నూల్: రాములు
8. పెద్దపల్లి: బి వెంకటేష్
9. చేవెళ్ల : డాక్టర్ రంజిత్ రెడ్డి