కడప, జనవరి 7: ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోమవారం వేకువజామున కడప జిల్లాలోని చుండుపల్లి, కన్నెపల్లె ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దానితో పోలీసులపై స్మగ్లర్లు, వారి వెంట ఉన్న కూలీలు కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రెండు వాహనాలను, 12లక్షల రూపాయల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అటవీశాఖ ఉద్యోగి చింతల ధర్మేంద్రతో సహా తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ చిన్నయన్ రవి ఉన్నారు.
previous post
next post