ఢిల్లీ, మార్చి 9 : జమ్మూ కశ్మీర్లోని బుద్గాం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని వచ్చిన వార్తలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది.
అవన్నీ తప్పుడు వార్తలేనని, ఏ ఒక్క జవాన్ కిడ్నాప్కు గురికాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. కిడ్నాప్ గురయ్యారని ప్రచారం చేసిన ఆ జవాన్ సురక్షితంగానే ఉన్నాడని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
శుక్రవారం శ్రీనగర్ లోని బుద్గం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ యాసీన్ బట్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి.
ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చిన యాసిన్ ను ఉగ్రవాదులు ఆయన ఇంట్లోకి చొరబడి, తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారని, ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారని మీడియాలో కధనాలు వచ్చాయి.