Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ బలగాలతో పాటు సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. తాజాగా ఈ రోజు తీర ప్రాంత నగరం ఒడెసాలోని తొమ్మిది అంతస్తుల భవనంపై రష్యా క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 18 మంది మృత్యువాత పడగా మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయన్ వర్గాలు తెలిపారు. రష్యా దాడులను తప్పించుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు భూగర్బ స్థావరాల్లో తలదాచుకుంటున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నల్లముద్రంలోని స్నేక్ ఐల్యాండ్ నుండి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే రష్యా సేనలు ఉక్రెయిన్ పై క్షిపణి దాడి జరిగింది. తొమ్మిది అంతస్తల భవనంపై జరిగిన క్షిపణి దాడికి భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం పాక్షికంగా కుప్పకూలింది. ఒడెసాలోని రిక్రియేషన్ సెంటర్ పైనా రష్యా క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఉక్రెయిన్ వ్యాప్తంగా 68 జనావాసాలపై రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ పేర్కొన్నారు. గత రెండు వారాలతో పోలిస్తే రష్యా దాడులు రెండింతలు పెరిగినట్లు ఒలెక్సీ హ్రోమోన్ ఆరోపించారు. మరో పక్క పౌరులపై దాడి చేస్తున్నారన్న ఉక్రెయిన్ అధికారుల ఆరోపణలను రష్యా ఖండించింది.