మువ్వెన్నల జెండా… అవి కేవలం రంగులు మాత్రమే కాదు. భారత జాతి ఆశల్ని, ఆశయాల్ని ప్రతిబింబించే వర్ణాలవి. భారతీయ జెండాలో ఒక్కొక్క రంగుకు ఒక్కో నిర్దిష్టమైన అర్థముంది. దేశ ప్రజల గుండెల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించే జాతీయ జెండాను ఆవిష్కరించడానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉంటాయి. దాన్ని ఎలా పడితే అలా చేస్తే దేశ ద్రోహం కిందే లెక్క.
ప్రస్తుతం అలాంటి పనే ప్రముఖ దినపత్రిక సాక్షి చేయడం గమనార్హం. నిన్న పంద్రాగస్టు సందర్భంగా దేశం యావత్తు జెండా వందన కార్యక్రమం చేపట్టి ఒకరికి ఒకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుని ఆనందించారు. చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఉప ముఖ్యమంత్రి రాజప్ప జెండా ఆవిష్కరించి వందనం చేయగా.. దాన్ని రిపోర్టు చేస్తూ సాక్షి జెండాను తిరగేసి పత్రికలో ప్రచురించడం దారుణం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పత్రిక అని పేరొందని సాక్షి ఇంత పెద్ద తప్పు చేయడంతో ఆ సంస్థపై దావా వేసే అవకాశాలు ఉన్నాయి. మరి అధికార పార్టీ పేపర్ అయిన సాక్షిపై ఏమైనా చర్యలు ఉంటాయా అంటే అనుమానమే!