ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. ఈరోజు జీతాలు వచ్చే రోజు కావున అందరూ ఆశగా తమ తమ జీతాలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కానున్నాయి.
ఆర్ధిక బిల్లును శాసనమండలి ఇంకా అంగీకరించని కారణంగా ఈరోజు పడాల్సిన జీతాలు ఏపీ ఉద్యోగులకు ఇంకా పడలేదు. ఈ బిల్లు పాసయ్యే వరకూ జీతాలు వేసే అవకాశం లేకపోవడంతో మరో రెండు లేదా మూడు రోజుల పాటు జీతాలు పడవు. ఆ తర్వాత శాసనమండలి బిల్లును ఆమోదించిన తర్వాత జీతాలు పడే అవకాశముంది. అసలే కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తే. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.