తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి ఎవరికి వరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది. తెలంగాణ రాష్ట్రం పుట్టిన గాని కాంగ్రెస్ ఇప్పటి వరకు తెలంగాణలో అధికారంలోకి రాలేదు. మరోపక్క కాంగ్రెస్ ఓటుబ్యాంకు రోజు రోజుకి దిగజారి పోతుంది. ఇటువంటి తరుణంలో దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా దారుణమైన ఫలితాలు వచ్చాయి.
దీంతో పిసిసి పదవిలో ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరిని నియమించాలనే దానిపై తెలంగాణ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాగూర్ అందరి అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్ కి నివేదిక అందించడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి మరికొంతమంది నేతల పేర్లు పీసీసీ పదవి విషయంలో వరించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇటీవల డీజీపీ మహేందర్ రెడ్డికి లెటర్ రాయడం జరిగింది. తనకు ప్రాణహాని ఉందని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంతమంది దుండగులు చంపేస్తామంటూ వరుసగా బెదిరింపు కాల్స్ చేస్తున్నారని లెటర్ లో డిజిపికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి అనుచరుల నుండి తనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా తనకి సెక్యూరిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. పీసీసీ పదవి రేవంత్ రెడ్డి కి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీంతో వీహెచ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.