భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కస్టమర్ల నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జిలు, మినిమం బ్యాలెన్స్ చార్జిలను వసూలు చేయబోవడం లేదని తెలిపింది. ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాల కస్టమర్లకు ఈ సదుపాయం లభిస్తుందని పేర్కొంది.
ఎస్బీఐలో గతంలో మెట్రో ఏరియా సేవింగ్స్ కస్టమర్లు రూ.3వేల వరకు తమ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ను ఉంచాల్సి వచ్చేది. అలాగే అర్బన్ ఏరియా కస్టమర్లు రూ.2వేల వరకు బ్యాలెన్స్ ఉంచాల్సి వచ్చేది. అలా బ్యాలెన్స్ ఉంచకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు చార్జిలను జీఎస్టీతో సహా కలిపి విధించేవారు. అయితే ఇకపై సేవింగ్స్ కస్టమర్ల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ను ఉంచాల్సిన పనిలేదు.
SBI's Savings Account means amazing benefits!
This Independence Day, free yourself from #SMSAlert and Minimum Balance charges with SBI's #SavingsAccount. To get freedom from unnecessary apps, download #YONOSBI now: https://t.co/wWHot51u7y #HappyIndependenceDay #Freedom pic.twitter.com/lX0Y9TQAdu— State Bank of India (@TheOfficialSBI) August 15, 2020
ఇక బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జిలు గతంలో రూ.12 గా ఉండేవి. దీనికి జీఎస్టీ అదనంగా తోడయ్యేది. అయితే ఇకపై ఈ చార్జిలను కూడా ఎస్బీఐ సేవింగ్స్ కస్టమర్లకు విధించడం లేదని ఎస్బీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ తెలిపింది. దేశంలో ఉన్న కోట్ల మంది సేవింగ్స్ ఖాతాదారులకు ఈ నిర్ణయం వల్ల ఎంతో ఊరట కలగనుంది.