ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరచుగా చేసే ఆరోపణలో ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తరచుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతారని.
ఇది నిజం కాదని బీజేపీ , వైసీపీ క్లారిటీ ఇస్తూనే ఉంటాయి అనుకోండి. ఈ విషయం ఇలా ఉంచితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దమ్ము ఏంటో తేల్చే సవాల్ను విసిరారు సోము వీర్రాజు
కేంద్రం గురించి ఎందుకు మాట్లాడరు?
పోలవరం విషయంలో సోము వీర్రాజు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “ఏడు మండలాలు ఏపీలో కలపాలని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు చెప్పిందే మేము. మా ప్రయత్నాలు వల్లే ఆనాడు ఆర్డినెన్స్ తెచ్చారు . పోలవరం ప్రాజెక్టు కు వైయస్ అంకురార్పణ చేశారు …. జగన్ పూర్తి చేస్తాడు అని మంత్రి అనిల్ అంటున్నారు. ఇందులో కేంద్రం పాత్ర, మోడీ సహకారం పై ఎందుకు మాట్లాడరు? పోలవరం అంచనాలు ఎలా పెరిగాయో అనిల్ కు తెలుసా? పట్టిసీమను విమర్శించిన మీరు.. అదే కాంట్రాక్టర్ను తెచ్చి పెట్టుకున్నారు. మీరు మమ్మలను విమర్శిస్తారు“ అని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యే అవినీతి…
పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిధులు ఇవ్వడం వాస్తవం కాదా అని వీర్రాజు ప్రశ్నించారు. “ పోలవరం పై 2014లో ఎస్టిమేషన్ల ప్రకారం నిర్మాణానికి కట్టుబడి ఉంది . కానీ సవరణలు అంత ఎలా పెరిగాయో.. అవినీతి ఎక్కడ జరిగిందో వెలికి తీయాలి. టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అవినీతి తో అందరినీ మేనేజ్ చేశారు. పోలవరం అంచనాలు ఎలా పెరిగాయో వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశీలించారా? దమ్ముంటే వైసీపీ ప్రభుత్వం టీడీపీ అవినీతి పై దర్యాప్తు చేయాలి“ అని సంచలన సవాల్ విసిరారు. “పోలవరం ఎత్తు తగ్గించేది లేదు.. కేంద్రం పూర్తి చేస్తుంది. ఎత్తు మీద టిడిపి, వైసిపి లు రాజకీయం చేస్తున్నాయి. పోలవరంపై అవగాహన లేకుండా రాధాకృష్ణ రాసిన రాతలను బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది “ అని తెలిపారు.
ఎర్ర చందనం , ముస్లిం ఆత్మహత్య
మామూలు దుంగలు తోలిన విధంగా ఎర్ర చందనం తరలిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. “రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ యధేచ్చగా సాగుతుంది. ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టాలి. నంద్యాలలో అబ్దుల్ సలాం ఉదంతంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆత్మహత్య ఘటనలో సిఐ, కానిస్టేబుల్ ను జైలుకు పంపారు . మరి రైతులు ఆత్మహత్య లు చేసుకుంటుంటే.. ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారా
పోలీసులు డ్యూటీ చేస్తే అరెస్టు చేస్తారా ? చంద్రబాబు ముస్లిం సంఘాలను రెచ్చ గొడుతున్నారు. జగన్, చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింల పేరుతో చంద్రబాబు పెద్ద ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తిరుమల లో అన్యాయం పై మేము ప్రశ్నిస్తే… బిజెపి మత తత్వ రాజకీయం అంటారు. ఇప్పుడు చంద్రబాబు, జగన్ లు చేసేదేమిటో… మీడియా కూడా వారిని ప్రశ్నించాలి“ అంటూ వీర్రాజు సంచలన కామెంట్లు చేశారు.
రాధాకృష్ణపై…
ఈ మధ్య కాలంలో రాధాకృష్ణ గారు పోలవరం గురించి తెగ రాస్తున్నారు అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. “చంద్రబాబు భాషకు అనుకూలంగా రాయాలనే తపన కనిపిస్తుంది. పోలవరం పైన, ముంపు మండలాల పైన రాధాకృష్ణ కు అవగాహన లేదు . ముంపు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి.. కేసీఆర్ ఎందుకు అడుగుతారు? భద్రాచలం ఏపీ పరిధిలో ఉండాలని బిజెపి కోరింది . పోలవరం పై తెలంగాణ లో అన్ని పార్టీ లు కలిసి పోయాయి . కేసీఆర్ పోలవరం ముంపు మండలంలో ఉన్న దుమ్మగూడెం కోసం అన్ని మండలాలు కావాలని పెట్టారు . ఆనాడు ఎపి కి అన్యాయం జరుగుతుందని బిజెపి అభ్యంతరం చెప్పింది . చంద్రబాబ, జగన్ లు కనీసం అడ్డు కూడా చెప్ప లేదు. తెలంగాణకు చెందిన హరీష్ రావు ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే… ఎపి నుంచి ఏ నాయకుడు అటు వెళ్ల లేదు . మన రాష్ట్రం లో విద్యుత్ ఫ్లాంట్ ను కూడా నాయకులు పట్టించుకోలేదు . హరీష్ రావు సిఫార్సులతో కేసిఆర్ కూడా మండలాలు కలుపుకున్నారు . రాధాకృష్ణ కు దమ్ముంటే… ఆ మండలాలు ఎపి లో కలిపేలా చూడు“ అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు కు అసలు పోలవరం కట్టాలనే ఆలోచనే లేదని , రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు కడితే చాలని భావించారని ఆయన ఆరోపించారు. పోలవరం పై చంద్రబాబు తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.