ఆటోమోటివ్ రంగం రోజు రోజుకి కొత్త కొత్త టేక్నాలజీ లతో పాటు కొత్త కొత్త బైక్స్ పుట్టుకొస్తున్నాయి.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అనేక స్మార్ట్ ఫీచర్స్, అప్ డేటెడ్ ఫీచర్స్ వాహన ప్రియులను అలరిస్తున్నాయి.. వాహన దారులకు సౌకర్యం కోసం ముఖ్యంగా ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ వాళ్లకు అనుకూలంగా ఎలక్ట్రిక్ బైక్లు ఇప్పటి వరకు అందుబాటులో లేవు.. ప్రముఖ వాహన తయారీ సంస్థ స్మార్ట్రన్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్గో బైక్ “టీబైక్ ప్లెక్స్” ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ.. ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి వివరాలు ఇలా..
ఫీచర్స్ :
భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రూపొందించింది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ అప్డేటెడ్ ఫీచర్ను కలిగి ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లో జియో ఫెన్సింగ్ , సెల్ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ లాక్, అన్లాక్ ఇంటిగ్రేటెడ్ వంటి అనేక రకాల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ లో ఇన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి అంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ బ్యాటరీ ఆయుష్షు 1,50,000 కిలోమీటర్లు ప్రయాణించే వరకు పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ కు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
డై బైక్ ఫ్లెక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ను వివిధ రకాల బ్యాటరీ బ్యాక్ ఆప్షన్లలో అందించనుంది 75 -120 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ లలో లభిస్తాయి. చాలా తక్కువ ఖర్చు కావడంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. 40 వేల రూపాయల ఖరీదైన ఈ ఎలక్ట్రిక్ బైక్ 40 కేజీల వరకు బరువు మోస్తుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ రంగాల వారు సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ ఒక పూర్తి ఛార్జ్ తో 75 – 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కామర్స్ వినియోగదారులు, ఫుడ్ డెలివరీ ఆపరేటర్లు ఉపయోగించుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుందని స్మార్ట్రన్ కంపెనీ చైర్మన్ లింగారెడ్డి తెలిపారు.