నైరోబీ (కెన్యా), జనవరి 16: కెన్యా రాజధాని నైరోబిలో ముష్కరులు రెచ్చిపోయారు. ఒక హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
నైరోబిలోని వెస్టలాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ‘డస్టిట్డీ 2’ హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాలపైకి బాంబులు విసిరారు. అనంతరం ఒక దుండగుడు తనకు తాను పేల్చుకున్నాడు. దాడి అనంతరం తుపాకులతో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా..మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే హోటల్ కాంప్లెక్స్ను భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
విదేశీయులు అధికంగా ఉండే ఈ హోటల్ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని
అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ‘ఆల్ షబాబ్’ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఈ ఘటనను దేశ ప్రధాని ఫ్రెడ్ మాషియాంగ్ ఖండించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు.