Sonu sood: దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి పరిస్థితులు మొత్తం తారుమారై పోయిన సంగతి తెలిసిందే. ఒక దేశంలో మాత్రమే కాక ప్రపంచంలో మనిషి భవిష్యత్తుపై వేసుకున్న ప్రణాళికలు మొత్తం ఈ మహమ్మారి తల్లకిందులు చేసింది. ఇదిలా ఉంటే మహామారి వల్ల ప్రభుత్వాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి.. సినీనటుడు సోనుసూద్ అనేక మంచి పనులు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వచ్చిన ప్రారంభంలో..లాక్ డౌన్ టైమ్ లో… వలస కూలీల ను ఆదుకున్న సోనుసూద్ ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక మంది పేదలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళ పిల్లలను చదివిస్తూ తన ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read more: Sonu sood: ఏపీలో ఆ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సోను సూద్..!!
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కూడా.. అనేకమంది కి.. ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయటమే కాక కొన్ని చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ లు కూడా అందుబాటులోకి సోను సూద్ తేవటం జరిగింది. ఇన్ని సహాయ కార్యక్రమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా అనేక మంది ఆదరాభిమానాలు దక్కించుకున్న సోనూ సూద్… ఇండస్ట్రీ లో జరగబోయే మా ఎలక్షన్లలో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మరికొద్ది నెలల్లో “మా” ఎన్నికలు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా అధ్యక్ష పదవి కోసం సోనూసూద్ కూడా పోటీ చేయడానికి రెడీ అయినట్లు.. వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ఇక వార్ వన్ సైడ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయి అని తనకి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎమోషనల్ టచ్ ఉందని గతంలోనే సోను సూద్ తెలపడం జరిగింది. ఇటువంటి తరుణంలో సోను సూద్…మా ఎన్నికలకు పోటీ పడటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.