Mega Star Chiranjeevi: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చిత్ర పరిశ్రమకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో మరెక్కడా లేనంత ఈర్ష, ద్వేషాలు ఉంటయని పేర్కొన్నారు. ఏదైనా మువీ కార్యక్రమాలు జరిగిన సందర్భంలో మాత్రం ఒకరినొకరు పొగుడుకోవడం, గొప్పలు చెప్పుకోవడంలో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో తెరవెనుక జరిగే వ్యవహారాలపై సంచలన కామెంట్స్ చేశారు ఆర్జీవీ. యాదృశ్చికమో లేక కావాలని చేసిందో కానీ శ్రీరెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేయడమే కాక గతంలో తాను చేసిన తప్పునకు సోషల్ మీడియా వేదికగా చెంపలు వేసుకుంది. చిరంజీవి మాతృమూర్తి తనను క్షమించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఫ్యామిలీని లాగితే హైలెట్ అవుతుందని తనకు నూరిపోశారనీ, అందుకే తాను అప్పట్లో చిరంజీవి తల్లి అంజనమ్మను ఉద్దేశించి మాట్లాడానని చెప్పుకొచ్చారు శ్రీరెడ్డి. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను ఇటీవల విడుదల చేసింది శ్రీరెడ్డి.
Mega Star Chiranjeevi: అమ్మవారి సాక్షిగా అంజనా దేవికి క్షమాపణలు
“ఒక తల్లిని తిట్టాను, నేనేం తిట్టానో మీ అందరికీ తెలుసు. దానికి శిక్ష కూడా అనుభవించాను. ట్రోల్స్ రూపంలోనూ ఫోన్ చేసి తిట్టడం లాంటివి జరిగాయి. మా వాళ్లు.. సొత వాళ్లు కూడా అలా అనడం చాలా తప్పున్నారు. అప్పటి నుండి కూడా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఒక మహిళను అన్యాయంగా తిట్టడం తప్పే. నేను ఒప్పుకుంటున్నాను. నా తప్పు పెద్ద మనసు చేసుకుని పెద్దమ్మ తల్లి ఎలా క్షమిస్తుందో అలా క్షమించమని కోరుకుంటున్నా, ఇండస్ట్రీలో చిరంజీవి అనే వారు ఒక పెద్ద హీరో. వారి అమ్మను అనాల్సింది కాదు. నా బుద్ది గడ్డి తిని ఆమెను తిట్టడం జరిగింది. అది కూడా ఒక కాజ్ లా తిట్టాలని మభ్య పెట్టారు. అమ్మవారి సాక్షిగా అంజనా దేవికి క్షమాపణలు కోరుతున్నాను” అని పేర్కొన్నారు శ్రీరెడ్డి.
ఆ కుట్రకు కారకులు ఎవరు..?
అయితే శ్రీరెడ్డి తనకు కొందరు నూరిపోసిన మాటలు విని చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేశానని చెప్పుకొచ్చారు కానీ ఎవరు ఈ పని చేయించారు అనేది వెల్లడించలేదు. తప్పు చేసినందుకు క్షమించమని కోరడం మంచి పద్ధతే అయినప్పటికీ ఆ కుట్రకు కారకులు ఎవరు అనేది కూడా చెబితే జనాలకు క్లారిటీ వచ్చినట్లు అయ్యేది. దీన్ని బట్టి చూస్తే సినీ పరిశ్రమలోని వ్యవహారాలపై రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు అక్షరసత్యాలు అనేది స్పష్టం అవుతోంది.