కొత్త సంవత్సరం మొదలవ్వగానే చాలా మంది తమ జీవితాలలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంటారు. ప్రతి న్యూ ఇయర్ కి రెజల్యూషన్ అంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ఈ ఏడాది ఏదో ఒకటి సాధించాలని డిసైడ్ అయ్యి దానికి అనుగుణంగా నడుచుకుంటారు. అయితే, ఇటువంటి ఒక రెజల్యూషన్ నే ఈ న్యూ ఇయర్ కి బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కూడా తీసుకుని సంచలనాన్ని సృష్టించింది. ఆమె అభిమానులు మరియు నెటిజన్లు ఆమె చేసిన పనికి షాక్ అయ్యారు. ఇంతకీ దీపికా ఏం చేసిందో తెలుసా?
దీపికా పదుకొణె ట్విటర్ మరియు ఇన్స్టగ్రామ్ ఖాతాలు డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత ఖాళీ అయ్యాయి. ఆమె ఇన్స్టగ్రామ్ మరియు ట్విటర్లోని ట్వీట్ అన్నీ డిలీట్ అయ్యాయి. ప్రస్తుతం దీపికా కి సంబంధించి ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక్క అప్డేట్ కూడా లేదు.
గత సంవత్సరంలో ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖల ట్విటర్ ఖాతాలు హ్యాక్ చేయబడిన విషయం తెలిసిందే. అలానే ఎవరైనా హ్యాకర్ లు దీపిక ఖాతాలను హ్యాక్ చేశారేమోనని అభిమానులు మరియు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
కానీ స్వయంగా ఆమె సన్నిహితులలో ఒకరు దీపిక కావాలనే వాటన్నింటినీ డిలీట్ చేసిందని చెప్పారు. ఇంస్టాగ్రామ్ లో డీపీ కూడా చేంజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం దీపికా తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి రాజస్థాన్ ట్రిప్ లో ఉంది. న్యూ ఇయర్ ను రాజస్థాన్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరు. అయితే, వీరిద్దరు కలిసి జంటగా నటించిన నాలుగో సినిమా ’83’. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 1983 వ సంవత్సరంలో క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన దానిగురించి ఈ చిత్రం ఉండబోతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!