ఇటీవల ఒక్కసారిగా నారా లోకేష్ మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకోవడం వెనకాల పెద్ద స్కెచ్ ఉన్నట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్ వస్తుంది. గత కొంతకాలంగా ఈ రెండు పార్టీలకు చెందిన ఈ కీలక నేతలు సైలెంట్ గా ఉండగా తాజాగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేయటం వెనకాల అదే రీతిలో మత రాజకీయాలు తెరపైకి తీసుకురావడం వెనకాల భారీ పొలిటికల్ ప్లాన్ వున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
మేటర్ లోకి వెళ్తే జగన్ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏకంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో, దేశంలో ఈ కార్యక్రమం కి మంచి రెస్పాన్స్ రావడంతో మాత్రమే కాక జాతీయ మీడియా జగన్ ని భారీ స్థాయిలో పొగుడుతున్న తరుణంలో.. ప్రభుత్వంపై ప్రశంశలు కొరవడటంతో పాటు మరోపక్క గత పాలకుల పై విమర్శలు రావడంతో టాపిక్ డైవర్ట్ చేయటానికి లోకేష్, పవన్ కళ్యాణ్ సడన్ గా రాజకీయ పర్యటనలు చేపట్టడం జరిగిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంత మంచి కార్యక్రమం పట్ల కాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి టిడిపి.. జనసేన పార్టీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని అధికార పార్టీకి చెందిన సీనియర్లు చెప్పుకొస్తున్నారు. అయితే మీరు వేసే డ్రామాలు ప్రజలు నమ్మడం లేదని.. గతంలో ఇలా చేయబట్టే 2019 ఎన్నికల్లో ఇంటికి పంపించారని పేర్కొన్నారు. కేవలం ఏడాదిన్నర పరిపాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ రాజ్యానికి బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.