నుడుంనొప్పి వింటేనే నొప్పి అనిపిస్తుంది కదా..! ఇది ఎందుకు వస్తుంది.. ఎలా వస్తుంది.. తగ్గించే గృహ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
ముందుగా ఇందుకు కారణమైన వెన్నుపూస గురించి తెలుసుకుందాం. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. సర్వైకల్, తొర్రసిక్, లంబార్, శక్రం.వీటిలో ఎక్కువగా సమస్య వచ్చేది సర్వైకల్,లంబార్ వాలనే. ఎందుకంటే ఈ రెండే ఎక్కువగా కదులుతూ ఉంటాయి. కాబట్టి త్వరగా అరిగిపోతాయి. మిగతా రెండు కదలవు కాబట్టి అరిగిపోవు. ఇవి ఎముకల,డిస్కు లతో ఉంటాయి. డిస్కుల మీద లోడు ఎక్కువగా పడటం వలన, గుంటలు ఉన్న రోడ్డులో ఎక్కువగా ప్రయాణించడం వల్ల, ఎక్కువగా ఒంగి పని చేయడం, బరువులు ఎత్తడం, ఎక్కువ సేపు కూర్చోవడం వలన 30 -40 వయసు వచ్చేసరికి ఈ సమస్యలు వస్తున్నాయి.
స్త్రీల విషయంలో నడుము భాగం ఎంత బాధిస్తుందో అనుభవించేవారికి తెలుస్తుంది. స్త్రీలలో 90 శాతం మందికి నడుం నొప్పి చాలా ప్రధానమైన, సామాన్యమైన సమస్య. నడుమునొప్పి రావడానికి అనేక కారణాలున్నాయి. ప్రసవం అయిన తరువాత శరీరంలో జరిగే మార్పుల వలన నడుము నొప్పి రావడం సర్వసాధారణం. నడుము కింది భాగంలో ఉండే నొప్పి కిందికి వంగినప్పుడో, వెనుకకు వాలినప్పుడో ఇంకా తీవ్రంగా ఆడవారిని బాధిస్తుంది.
అంతేకాకుండా యువతలో ఎందుకు కనిపిస్తుందంటే ఎక్సర్సైజ్ ను సరిగ్గా చేయకపోవడం గానీ, గుంటలు ఉన్న రోడ్డులో ఎక్కువగా ప్రయాణించడంవల్ల వస్తుంది. కొంచెం పెద్ద వయసులో మనం పని చేసే విధానంలో ఎక్కువ సేపు కూర్చోడం, డిస్కు అరిగిపోవడం, అర్థరైటిస్, స్పాండిలైటిస్ రావటం, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా అలాగే కూర్చోవడం వలన వస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అదేపనిగా కూర్చొని పనిచేయడం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఒబేసిటీ ఒక కారణం.
వంటింటి చిట్కాలు :
కప్పు పాలలో చెంచా తేనే వేసుకుని రోజూ తాగడం వలన నడుం నొప్పి రాకుండా చూసుకోవచ్చు.
నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ తో రుద్దడం వలన ఉపశమనం లభిస్తుంది.
రెండు కప్పుల నీటిలో తరిగిన అల్లం ముక్కలను వేసి ఏ ఒక కప్పు అయ్యేవరకు మరిగించి ఆ నీటిని చల్లారాక తేనె కలుపుకుని తాగితే నొప్పి తగ్గుతుంది.
రెండు చెంచాల గసాల పొడి పాలలో కలుపుకుని రోజుకు రెండు సార్లు తీసుకున్నా ఫలితం ఉంటుంది.
ఎక్కువగా బరువులు ఎత్తకుండా ఉండాలి. ఒంగోని లెగవటం తగ్గించాలి. గతుకులు ఉన్న ప్రదేశాల్లో ప్రయాణించే పోవడమే మంచిది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకొని మరలా పని చేసుకోవాలి.