బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీమ్ కోర్టు ఈరోజు కీలక తీర్పునిచ్చింది. కేసు పత్రాలను, సేకరించిన ఆధారాలను సీబీఐకు అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీమ్ కోర్టు కోరింది.
అలాగే సీబీఐకు సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిర్ణయం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం తన అసంతృప్తిని తెలియజేసింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా సీబీఐకు కల్పించింది అత్యున్నత న్యాయస్థానం. బీహార్ సీఎం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేసును సీబీఐకు రికమెండ్ చేసింది కేంద్రం. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు తీర్పుతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదు హత్యే అని బలంగా వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.