రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు జరుగుతుంటాయో ఊహించలేం. ఒక చోట ఒక లెక్కతో వేసిన గేమ్ మరో చోట ఇంకో సమీకరణానికి మార్గం వేయవచ్చు , కారణం కావచ్చు.
తాజాగా అలాంటి చర్చే తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వినిపిస్తోంది. ఇదంతా ఎన్నికల గురించి.
గ్రేటర్ హైదరాబాద్ పోరులో …
కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2016 లో నిర్వహించిన వార్డుల ప్రకారమే ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధపారథి తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నవంబర్ 18న ప్రారంభించనున్నారు. డిసెంబరు 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఏపీ ఫోకస్ కూడా..
షెడ్యూల్ విడుదల అవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనే.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే , ఏపీ ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని అభిప్రాయపడింది ఎస్ఈసీ… కరోనా కేసుల సంఖ్య 10,753కి తగ్గిపోయిందని అభిప్రాయపడింది.. ఇదే సందర్భంలో.. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని ఏపీ ఎస్ఈసీ గుర్తు చేసింది. తద్వారా తెలంగాణలో జరిగే ఎన్నికలు ఏపీ సీఎం జగన్ను ఇప్పుడు పరీక్షను తెచ్చిపెట్టాయని పలువురు చర్చించుకుంటున్నారు.