ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది మంత్రులపై విమర్శలు వస్తుంటే కృష్ణా జిల్లాకు చెందిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యవహారం మాత్రం అధికారులను టెన్షన్ పెట్టిస్తుందట. మచిలీపట్నం నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలిచిన పేర్ని నాని అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిగా అందరితో కలిసి పోతూ ఉంటారు.
కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో లాక్ డౌన్ సమయం లో పోలీసులతో అదేవిధంగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ పేర్ని నాని వ్యవహరించిన తీరు అప్పట్లో అందరినీ ఆకర్షించింది. మొదటి నుండి మంత్రి నాని తీరు ఈ విధంగానే ఉంటది. రిక్షా లో అసెంబ్లీ లోకి వెళ్లడం. అనుచరుల వాహనాలలో నియోజకవర్గ పర్యటనలు చేస్తూ ప్రతి ఒక్కరితో పేర్నినాని కలిసి పోతుంటారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాత్రమే కాక మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ విధంగానే వ్యవహరించడంతో పేర్ని నాని శాఖకు చెందిన అధికారులకు ఇబ్బందిగా మారినట్లు వార్తలు వినబడుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ప్రజల కోసం చేసే అన్ని కార్యక్రమాల వివరాలు మీడియాకు అందించే శాఖ ఐ అండ్ పీఆర్. అటువంటి శాఖకు మంత్రిగా ఉన్న పేర్ని నాని ఇప్పటికీ తనదైన శైలిలో నియోజకవర్గంలో పర్యటనలు చేయటం ఆ శాఖ అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్నదట. సొంత నియోజకవర్గంలోనే నివాసం, క్యాంప్ ఆఫీస్ ఉండటంతో ఆయన పర్యటనకు వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో ఐ అండ్ పీఆర్ అధికారులు షాక్ కి గురి అవుతున్నారు అట. మంత్రి వెంటే ఉంటున్న గమనించ లేని పరిస్థితి. మంత్రిగారు ఏ సమయంలో ఎలా ఉంటారు..? ఎక్కడికి పర్యటనకు వెళ్తారు..? అనే దాని విషయంలో అధికారులు తెగ టెన్షన్ పడుతున్నారట.