సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో హీట్ ఎక్కాయి. ఎప్పటినుండో అభిమానులు ఎదురుచూస్తున్న ఈ వార్త కోసం రజిని తాజాగా ట్విట్టర్లో స్పందించడంతో పాటు డిసెంబర్ 31న పార్టీకి సంబంధించి కార్యాచరణ విధి విధానాలు చెప్పడం జరుగుతుంది అని క్లారిటీ ఇవ్వడంతో తమిళ రాజకీయ లెక్కలు ఒక్కసారిగా మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆసక్తికర ట్వీట్ చేశారు. రజనీ నిర్ణయంతో తమిళ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు ఒక్కసారి గా మారినట్లు పేర్కొన్నారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ తో తమిళ అసెంబ్లీ ఎన్నికలు రజనీ వర్సెస్ శశికళ మధ్యనే జరుగుతాయని జోష్యం చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా రజనీ నిర్ణయంతో బిజెపి డైలమాలో పడిందని అదే విధంగా ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారడం జరిగింది.
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న డీఎంకే నీ పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చేసిన ట్వీట్ ఉద్దేశపూర్వకంగా తమిళ రాజకీయ కోణాన్ని… ప్రజల దృష్టిలో రజినీ వర్సెస్ అన్నాడీఎంకే పార్టీ అన్న రీతిలో క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా శశికళ జైలు నుంచి విడుదల అయిన తర్వాత తమిళ రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలో టాక్.