కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ పోలింగ్ ముగియగా మరొక 15 నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే వైసిపి విజయం ముందే ఖరారు అయిపోగా చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వర్ల రామయ్య ను రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పటికే కరణం బలరాం, వల్లభనేని వంశీ మరియు మద్దాలి గిరి టిడిపిలో ఉంటూనే వైసీపీ పార్టీకి వత్తాసు పలుకుతున్న విషయం తెలిసిందే.
అందుకనే చంద్రబాబు కచ్చితంగా వారు ఎవరివైపు ఉన్నారో స్పష్టంగా తెలుసుకునేందుకు మరియు వారిని ఇరుకున పెట్టేందుకు విప్ ను జారీచేసి వారు ఖచ్చితంగా ఓటింగ్ కు వచ్చేటట్లు వ్యూహం రచించారు. వారు ఓటింగ్ కు రాకపోతే మాత్రం వారిపై అనర్హత వేటు వేసే అవకాశం చంద్రబాబుకి ఉంటుంది. కావున వారు ముగ్గురు ఓటింగ్ కు వచ్చారు.
అయితే వచ్చిన వారు ఓటు వేసి కామ్ గా వెళ్ళిపోకుండా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలకు దిగారు. వల్లభనేని వంశీ మాట్లాడుతూ కేవలం దళితుడని వర్ల రామయ్యను పార్టీ ఓడిపోతుంది అని తెలిసినా కూడా బాబు బరిలో నిలిపాడని…. గతంలో అతనికి మెజారిటీ ఉన్నప్పుడు రాజ్యసభ సీటును దళితుడికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిని బట్టి చంద్రబాబు నాయుడు వైఖరి మరియు ఆలోచనని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పిన వంశీ…. జగన్ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు అని కొనియాడాడు. ఇక చంద్రబాబు కి ఇంతకన్నా స్పష్టమైన క్లారిటీ రాదేమో.