చంద్రబాబు వైఖరిపై విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నారా.. ? ఇంతకు ముందు మాదిరిగా చంద్రబాబుతో సఖ్యతగా ఉండలేకపోతున్నారా.. ? అంటే అవుననే సమాధానం వస్తుంది. కేశినేని కుటుంబ వివాదాల్లో రాజకీయం చోటుచేసుకోవడంతో ఆ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కేశినేని నానికి ఆయన సోదరుడు చిన్నికి మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు కుటుంబాలకు మాటలు లేవు. అయితే చిన్ని విజయవాడ టీడీపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇది కేశినేని నానికి ఇష్టం లేదు. పలువురు పార్టీ నాయకులు కూడా కేశినేని సోదరుడుతో సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ నాయకత్వం కూడా చిన్నిని ప్రోత్సహిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ..ఢిల్లీకి వెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని ప్రవర్తన అవాక్కు అయ్యేలా చేసింది. అక్కడ పరిమాణం చూసిన వాళ్లు చంద్రబాబు పట్ల కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
విషయంలోకి వెళితే .. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏపి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీగా అమృత్ మహోత్సవ్ లో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లగా, టీడీపీ ఎంపీలు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు లతో పాటు కేశినేని నాని చంద్రబాబుకు స్వాగతం పలికారు. ముందుగా చంద్రబాబును దుశ్సాలువా కప్పి సత్కరించి ఆహ్వానం పలికారు. తరువాత చంద్రబాబుకు అందజేసేందుకు గాను కేశినేని నానికి గల్లా జయదేవ్ బొకే ఇచ్చే ప్రయత్నం చేయగా తిరస్కరించి మీరే ఇవ్వాలంటూ వారించారు. అన్నా తీసుకుని ఇవ్వు అన్నట్లుగా మరో సారి గల్లా జయదేవ్ ప్రయత్నించగా గట్టిగా ఆయన చేయిని అవతలకు తోసేశారు కేశినేని నాని. ఈ పరిణామంతో చంద్రబాబు అవాక్కయాడని అంటున్నారు. చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి, ఆయన పక్కన నిలబడటానికి కూడా కేశినేని ఇష్టపడకుండా ముభావంగా ఉన్నాడని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా చంద్రబాబు ఆ తరువాత గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. తదుపరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డిఏ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ప్రకటించింది.
21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆ నలుగురు ప్రముఖులు