ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీని ఉద్దేశిస్తూ ముందు గవర్నర్ ప్రసంగించాల్సి ఉండగా ఆ ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం బహిష్కరించడం గమనార్హం.
ఇదిలా ఉండగా ముందు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించారని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు నెలలు వాయిదా పడ్డ బడ్జెట్ సమావేశాలు ఎట్టకేలకు ఈ రోజున నిర్వహిస్తున్నారు.
ఇకపోతే ఉభయ సభలను ఉద్దేశించి ఇస్తున్న గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించడం గమనార్హం. అంతేకాకుండా గత రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు మరియు జేసీ ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన కారణంగా టిడిపి నాయకులు అంతా నల్ల చొక్కాలతో నినాదాలు చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా గవర్నర్ అబద్ధాలకోరు అని చెప్పి అతని ప్రసంగాన్ని బహిష్కరించారు.