కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసనమండలి లను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ఫేవరెట్ మేటర్ అయిన మూడు రాజధానుల అంశం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ వంటి విచ్ఛిన్నమైన రాష్ట్రానికి పరిపాలన వికేంద్రీకరణ అత్యంత ఆవశ్యకమని వ్యాఖ్యానించిన ఆయన అన్ని ప్రాంతాలు అభివృద్ధే ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం యొక్క ఉద్దేశమని ఆయన జగన్ ను సమర్థించాడు. ప్రస్తుతం మూడు రాజధానులు బిల్లు శాసన పరిధిలో ఉందని అన్నారు.
వైఎస్ జగన్ సర్కారు అమరావతి ని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా మరియు కర్నూలు ను న్యాయ రాజధానిగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న మండలిలో మాత్రం ఆ బిల్లును నెగ్గించుకోలేక చతికిలపడిన విషయం కూడా తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించారని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.