తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు కేసు ని అతని ఆరోగ్య పరిస్థితిని అడ్డంపెట్టుకుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తోంది. వీలైనంత ఎక్కువ సమయం అచ్చెన్నాయుడు ని హాస్పిటల్ కే పరిమితం చేసేలాగా వ్యూహాలు రచిస్తున్న టిడిపి బృందం బెయిల్ వచ్చే వరకు అతను జైలు గోడలు చూడకూడదని భావిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు సమాధానంగా అతని చుట్టూ మరింత పటిష్టంగా ఉచ్చుబిగిస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ఇప్పటికీ ఈఎస్ఐ స్కామ్ లో దాదాపు 150 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నిర్ధారించగా ఇప్పుడు మనీలాండరింగ్ మనీ లాబీయింగ్ కేసులు కూడా అచ్చెన్న పై తాజాగా నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విలేకరుల ప్రెస్ మీట్ లో వెల్లడించడం గమనార్హం. వాస్తవానికి అవినీతి జరిగిందని నిరూపించాలంటే అరెస్టు అయిన వ్యక్తి లేదా లంచం ఇతర రూపాల్లో అవినీతి సొమ్మును తీసుకున్నట్లు ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. అయితే టెలీ హెల్త్ సర్వీసెస్ కు లబ్ది కలిగించేలా అచెన్న లేఖ రాశారని ఏసీబీ తన వాదనలో పేర్కొంది.
ఇక ఈ కేసును మరింత బలపరిచేందుకు ఆ సంస్థ నుంచి అచ్చెన్నాయుడు లేదా అతని కుటుంబానికి చెందిన వారు లేదా అతనివి అని చెప్పబడుతున్న బినామీ కంపెనీల అని ఆరోపించబడుతున్న వాటికైనా ఆ సంస్థ నుండి ప్రయోజనం కలిగినట్లు ఖచ్చితమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అది జరగకపోతే కోర్టు వారి నుండి ఎసిబి అధికారులకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురు పడతాయని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే స్వయంగా స్పీకర్ అచ్చెన్న పై మనీలాండరింగ్ మరియు మనీ లేయింగ్ కేసులు పెడతామని ప్రకటించడం ఇప్పుడు పెద్ద దుమారం లేపింది.
నిజానికి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అచ్చెన్నయుడు అతని పై అసెంబ్లీ లో విపరీతంగా విరుచుకు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు అచ్చెన్నాయుడు జగన్ లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేసిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తుండగా జగన్ కూడా అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు యొక్క పారదర్శకతను ప్రశ్నించాడు. ఇప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్లు మాత్రమే కాకుండా అందుకు సంబంధించిన లోగుట్టు వ్యవహారం చాలానే నడిచిందని వైసిపి వర్గాలు చెబుతూ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ప్రభుత్వం ఏసీబీ అధికారులకు సహకరిస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి.
ఇదే కనుక నిజమైతే నిజంగా అచ్చెన్నాయుడు కథ కంచికి వచ్చేసినట్లే. ఈ ఎస్ ఐ మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని కొంతమంది అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం నుంచి 130 శాతం ఎక్కువ ధరకు మందులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాథమికంగా అంచనా మేరకు మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడుతో పాటుగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.