ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని కేంద్రంలో కొలువు దీరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టార్గెట్ 370 స్థానాలను పెట్టుకున్నారు. దేశవ్యా ప్తంగా 370 పార్లమెంటు స్థానాల్లో బీజేపీనే ఒంటరిగా 370 సీట్లు దక్కించుకోవాలన్నది మోడీ ప్లాన్. ఈ క్రమం లో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పార్లమెంటు సీట్లను గుండుగత్తగా గెలుచుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 80 పార్లమెంటు స్థానాలు ఉన్నయూపీలో గెలుస్తామని ఆయన చెబుతున్నారు.
తాజాగా ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన మంత్రి ప్రతి రాష్ట్ర బీజేపీ చీఫ్తోనూ ప్రత్యేకంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితిని తెలుసుకున్నారు. అదేసమయంలో ఆయన తన మనసులో మాటను చెప్పేశారు. మీమీ రాష్ట్రాల్లో నాకు ఇన్ని సీట్లు కావాలి.. మనకు ఇన్ని సీట్లు రావాలి.. అని తేల్చిచెప్పారు. క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్లతోనూ మోడీ ప్రత్యేకంగా రెండేసి నిమిషాలపాటు భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ సారథి.. కేంద్ర మంత్రికిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పుంరదేశ్వరిలతోనూ మోడీ చర్చలకు దిగారు.
ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలలో కలిపి మొత్తంగా 20 పార్లమెంటు స్థానాలు నాకు గిఫ్టుగా ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. `మీరు ఏమైనా చేయండి. ప్రజల్లోకి వెళ్లండి. మీ చరిష్మా, నా చరిష్మా ఏది వినియోగించినా ఫర్వాలేదు. 20 సీట్లు కావాలి` అని మోడీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డికి హితవు పలికినట్టు సమాచారం. గిరిజన యూనివర్సిటీ ఇచ్చామని, రైల్వే లైన్లను పెంచామని.. అనేక కార్యక్రమాలు చేస్తున్నామని.. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు.
ఏపీ విషయానికి వస్తే.. పొత్తుల విషయాన్ని ప్రస్తావించకుండా.. పురందేశ్వరికి గట్టి టార్గెట్ పెట్టినట్టు సమా చారం. ఏపీలో 25 పార్లమెంటు స్థానాల్లో 12 నుంచి 10 గెలవలేరా? అని ప్రశ్నించిన మోడీ పురందేశ్వరిని డిఫెన్స్లో కి నెట్టేసినట్టు తెలిసింది. దీనికి ఆమె ఔననలేక.. కాదనలేక.. సరేనని తలూపారని సమాచారం. తెలంగాణలో 17, ఏపీలో 25 స్థానాలు ఉన్నాయని.. వీటిలో తనకు గిఫ్టుగా 20 స్థానాలు ఇవ్వాలని తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. దేశవ్యాప్తంగా ఇదే టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. మరి తెలుగు రాష్ట్రాలబీజేపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.