NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అంటే… మోడీ పెట్టిన టార్గెట్ ఇదే..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని కేంద్రంలో కొలువు దీరాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టార్గెట్ 370 స్థానాల‌ను పెట్టుకున్నారు. దేశ‌వ్యా ప్తంగా 370 పార్ల‌మెంటు స్థానాల్లో బీజేపీనే ఒంట‌రిగా 370 సీట్లు ద‌క్కించుకోవాల‌న్న‌ది మోడీ ప్లాన్. ఈ క్ర‌మం లో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పార్ల‌మెంటు సీట్ల‌ను గుండుగ‌త్త‌గా గెలుచుకోవాల‌ని ప్ర‌ధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 80 పార్ల‌మెంటు స్థానాలు ఉన్న‌యూపీలో గెలుస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.

తాజాగా ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌తి రాష్ట్ర బీజేపీ చీఫ్‌తోనూ ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేశారు. మీమీ రాష్ట్రాల్లో నాకు ఇన్ని సీట్లు కావాలి.. మ‌న‌కు ఇన్ని సీట్లు రావాలి.. అని తేల్చిచెప్పారు. క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లతోనూ మోడీ ప్ర‌త్యేకంగా రెండేసి నిమిషాల‌పాటు భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ సార‌థి.. కేంద్ర మంత్రికిష‌న్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పుంర‌దేశ్వ‌రిలతోనూ మోడీ చ‌ర్చ‌ల‌కు దిగారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ‌, ఏపీల‌లో క‌లిపి మొత్తంగా 20 పార్లమెంటు స్థానాలు నాకు గిఫ్టుగా ఇవ్వాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. `మీరు ఏమైనా చేయండి. ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి. మీ చ‌రిష్మా, నా చ‌రిష్మా ఏది వినియోగించినా ఫ‌ర్వాలేదు. 20 సీట్లు కావాలి` అని మోడీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని కిష‌న్ రెడ్డికి హిత‌వు ప‌లికిన‌ట్టు స‌మాచారం. గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఇచ్చామ‌ని, రైల్వే లైన్ల‌ను పెంచామ‌ని.. అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని.. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని ఆయ‌న సూచించారు.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. పొత్తుల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా.. పురందేశ్వ‌రికి గ‌ట్టి టార్గెట్ పెట్టిన‌ట్టు స‌మా చారం. ఏపీలో 25 పార్ల‌మెంటు స్థానాల్లో 12 నుంచి 10 గెల‌వ‌లేరా? అని ప్ర‌శ్నించిన మోడీ పురందేశ్వ‌రిని డిఫెన్స్‌లో కి నెట్టేసిన‌ట్టు తెలిసింది. దీనికి ఆమె ఔన‌న‌లేక‌.. కాద‌న‌లేక‌.. స‌రేన‌ని త‌లూపార‌ని స‌మాచారం. తెలంగాణ‌లో 17, ఏపీలో 25 స్థానాలు ఉన్నాయ‌ని.. వీటిలో త‌న‌కు గిఫ్టుగా 20 స్థానాలు ఇవ్వాల‌ని తేల్చి చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా ఇదే టార్గెట్ పెట్టిన‌ట్టు తెలిసింది. మ‌రి తెలుగు రాష్ట్రాల‌బీజేపీ నేత‌లు ఏం చేస్తారో చూడాలి.

Related posts

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju