ప్రపంచం మొత్తం మీద దెయ్యాల గురించి కొన్ని వేల కథలు ఉన్నాయి. ఈ కథలను ఆధారం చేసుకుని దాదాపు అన్ని భాషల్లోనూ కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అసలు దెయ్యం ఉందో లేదో కానీ ఆ దెయ్యాల కథలు, సినిమాలలు మాత్రం తెగ పాపులర్ అయిపోతాయి. కానీ నిజ జీవితంలో మనుషులకు దెయ్యం అన్న భావన మాత్రం వణికించేస్తోంది. ఇన్ని సినిమాలు, కథలు చూసాక దెయ్యం అన్న పదం వినగానే మనుషులు ఒక రూపాన్ని ఊహించేసుకుంటారు. కానీ కొంతమందికి దెయ్యాల పేరు వింటే తెలియని ఆతృత వస్తుంది. అటువంటి వారు ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.
పశ్చిమబెంగాల్లో ఓ రైల్వేస్టేషన్ ను దెయ్యాలకు కేంద్రంగా చెబుతుంటారు స్థానికులు.. ఈ రైల్వేస్టేషన్లో దెయ్యాలు తిష్ఠ వేశాయట. అందుకే అక్కడ రాత్రివేళ ఒక్క మనిషి కూడా కనిపించడట. అసలు దీని హిస్టరీ ఏమిటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పురులియా జిల్లాలో బెగన్ కోడార్ ప్రాంతంలో ఓ రైల్వేస్టేషన్ ఉంది. ఈ రైల్వేస్టేషన్ ని 1960 లో నిర్మించారట. 1967లో ఆ రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ మరణించారట. అయితే ఎలా రేగిందొ కానీ అతడిని దెయ్యం చంపిందని స్థానికుల్లో ఓ పుకారు రేగింది. ఇంకేముంది అప్పటి నుంచి ఆ రైల్వేస్టేషన్లో ఒక్క రైలు కూడా ఆగలేదు.
2007లో పశ్చిమబెంగాల్లో అప్పటి రైల్వేశాఖమంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వేస్టేషన్ ని రీ ఓపెన్ చేసారు. ప్రస్తతం రైల్వేస్టేషన్ గోడలపై దేవుళ్ల చిత్రపటాలను పెయింటింగ్లను ఉంచారు. ప్రజలలో భయం పోగొట్టడానికి ఇటీవల కొందరు యువకులు ఓ రాత్రంతా ఆ రైల్వేస్టేషన్లో గడిపారు. ఆ తరువాత ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి దయ్యాలు లేవని మేము రాత్రంతా అక్కడ గడిపామని వారు ప్రచారం చేశారు.