తెలంగాణలో కమలం పార్టీ రోజురోజుకీ వికసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కంట్రోల్ చేయడంలో హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేని విధంగా వరదలు రావడంతో ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు, దీంతో టిఆర్ఎస్ పార్టీపై ప్రజలలో భయంకరమైన వ్యతిరేకత ఏర్పడినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్.
అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం తో పాటుగా రాష్ట్రంలో పలు సమస్యలపై బిజెపి మాదిరిగా పోరాడటం లేదని బయట మాత్రమే కాక పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది కీలక నాయకులు బిజెపి పార్టీ లోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వద్దకు కాంగ్రెస్ పార్టీ నేతలు క్యూ కడుతున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ బిజెపి పార్టీ శ్రేణులు కూడా ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఎక్కువగానే కష్టపడుతున్నట్లు చర్చలు కూడా జరుపుతున్నారట. ఈ క్రమంలో పదవుల ఆఫర్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఓ కీలక నేతకు హైదరాబాద్ మేయర్ పదవి కూడా ఆఫర్ చేశారని ఉంటున్నారు. అంతమాత్రమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీటు కూడా ఇస్తామని చెప్పినట్టు టాక్. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లోకి చాలామంది నాయకులు వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ లెక్కలు తప్పుతున్నట్లు, జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటాపోటీ టీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఏంటో భవిష్యత్తు రాజకీయాలు విషయంలో ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువగా బిజెపి వైపు చూస్తున్నట్లు సమాచారం.