కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 40 శాతం కంప్లీటయిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 9 న సెట్స్ మీదకి వస్తోంది. చరణ్ కీలక పాత్ర లో కనిపించబోతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
కాగా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ ముందు మొదలు పెట్టాలన్న ఆలోచనలో మెగాస్టార్ ఉన్నారు. కాని ఈ సినిమా కి రీమేక్ కథ పెద్దగా సెట్ కావడం లేదని సమాచారం. ముందు ఈ సినిమా తెరకెక్కించే బాధ్యలు సాహో ఫేం సుజీత్ కి అపగించారు. సుజీత్ ఈ సినిమా మీద దాదాపు 3 నెలలు వర్క్ చేశాక పూర్తి స్థాయిలో మెగాస్టార్ కి కథ నచ్చకపోవడం తో ఆ బాధ్యత వి.వి.వినాయక్ కి అప్పగించారు.
మెగాస్టార్ – వినాయక్ కాంబినేషన్ లో ఠాగూర్, మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 వచ్చాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో మెగాస్టార్ పూర్తి నమ్మకంతో లూసీఫర్ రీమేక్ బాధ్యతలు వినాయక్ అప్పగిస్తే ఇప్పటికే రెండు మూడు వర్షన్ రెడీ వినిపించగా మెగాస్టార్ శాటిసిఫై అవలేదట. దాంతో ఇక ఈ ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేయలేనని డ్రాపయినట్టు తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే కాస్త షాకింగ్ విషయమే అని చెప్పాలి. వినాయక్ లాంటి అగ్ర దర్శకుడు హ్యాండిల్ చేయలేకపోతే మెగా అభిమానులు హర్ట్ అవడం ఖాయం అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటన్నది వెల్లడి కావాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!