Murders: ఈ మధ్య కాలంలో హత్యలు బాగా ఎక్కువైపోతున్నాయి అని పోలీసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో హత్యలకు వివిధ కారణాలు ఉన్నాయట. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన తరువాత కూడా ఇంకా ఒకరిని ఒకరు చంపుకుంటూ అనాగరికతలో జీవిస్తున్నారా?…. అంటే అవుననే అంటున్నారు పోలీసులు. అసలు ఈ హత్యల వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటని ఓ అధ్యయనాన్ని చేపట్టగా అందులో వారికి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఈ అధ్యయనంలో ఫలితాలను పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తున్నారు.
అయితే పోలీసుల నుంచి లభించిన సమాచారం మేరకు 2017 నుంచి 2019 వ సంవత్సరం మధ్యలో అనగా 2017, 2018, మరియు 2019 మూడేళ్ల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 2859 హత్యలు నమోదయ్యాయట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హత్యల్లో సగానికి పైగా కేవలం వివాహేతర సంబంధాల వలనే చోటు చోటుచేసుకున్నాయట. అయితే పోలీసులు తాజాగా జరిపిన ఈ పరిశోధన లో ఈ మొత్తం హత్యలలో కేవలం వివాదాలకు కారణాలు మరియు వివాహేతర సంబంధాల వలన జరిగిన మొత్తం హత్యలు 58.6 శాతం అని తేల్చారు. అంతేకాకుండా ఈ హత్యలలో బాధితులు ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే అట.
హత్యలు జరగడానికి ముఖ్య కారణాల జాబితాలో ముందుగా వివాహేతర సంబంధాలు కారణంగా హత్యలు ఉండగా ఆ తర్వాతి స్థానంలో కుటుంబ తగదాలు, భూ వివాదాలు మరియు నగదు లావాదేవీల వలన తలెత్తిన గొడవలే అని తేలింది. మొత్తం మీద మన రాష్ట్రంలో హత్యలకు ప్రధాన కారణంగా రెండే అంశాలను చెప్పవచ్చు. అందులో మొదటిది వివాహేతర సంబంధాలు కాగా ఇక రెండవది ఆర్థిక లావాదేవీలు.