NewsOrbit
న్యూస్

అప్పుడు నందిగం సురేష్ బాబు …ఇప్పుడు డాక్టర్ గురుమూర్తి!జగన్ రూటే సపరేటు!!

ఏమాత్రం ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులను ఏకంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించడం అనేది ఏపీ సీఎం ,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పెషాలిటీగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.అదే సమయంలో ఆ కోవకు చెందిన అభ్యర్థుల విషయంలో పార్టీ పట్ల తన పట్ల వారికున్న నిబద్ధతను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ముఖ్యంగా దళిత నేతల విషయంలో జగన్ ఈ ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ సందర్భంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్బాబు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ గురుమూర్తిలను రాజకీయపరిశీలకులు ఉదహరిస్తున్నారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో గడ్డివాములు తగలబెట్టారన్న కారణంతో నందిగం సురేష్ బాబును పోలీసులు తీవ్రంగా హింసించారు.ఒక దశలో తనను చంపేయడానికి కూడా పోలీసులు పథకం వేశారని సురేష్ బాబు చెబుతుంటారు.అయితే ప్రాణ త్యాగానికి కూడా సురేష్ బాబు సిద్ధపడడాని పరిగణనలోకి తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆయన్ను బాపట్ల లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు.

తదుపరి ఎంపీ సీటు ఇచ్చి గెలిపించారు.అంతేకాదు ఆయన చేతనే మొన్నటి లోక్సభ ఎన్నికల వైసిపి ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయించారు.తాడేపల్లిలోని వైసిపి పార్టీ కార్యాలయాన్ని సురేష్బాబు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ ప్రారంభింపజేశారు.ఇప్పుడు తాజాగా తన కుటుంబానికి అత్యంత విధేయుడు సోదరి షర్మిల, తన పాదయాత్రల సందర్బంగా వెన్నంటి ఉండి ఫిజియోథెరపిస్టుగా సేవలందించిన డాక్టర్ గురుమూర్తిని ఆయన తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. డాక్టర్ గురుమూర్తి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడు. వైసిపికి వీరాభిమాని.తన వృత్తిని కూడా వదులుకొని ఆయన జగన్ వెంటే నడుస్తుంటారు.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్ ఆయన్ను ఎంపీ స్థానంలో పోటీకి నిలబెట్టారు.నిజానికి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలన్న సంప్రదాయాన్ని కూడా జగన్ పక్కన పెట్టారు.కనీసం పది లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేనని డాక్టర్ గురుమూర్తి చెప్పినప్పటికీ అంతా నేను చూసుకుంటానని జగన్ భరోసా ఇచ్చి మరీ ఆయన భుజం తట్టారు.జగన్ తీసుకున్నది సంచలన నిర్ణయమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.ఈ చర్య ద్వారా ఆయన దళిత హృదయాలను కూడా గెలుచుకున్నారు.నమ్మిన వారికి తాను కొంగుబంగారమని జగన్ నిరూపించుకున్నారు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N