Rent House: ఇల్లు అద్దెకు ఇచ్చి ప్రతిఫలంగా నెల నెలా కొంత నగదును ఇంటి యజమాని వసూలు చేస్తారు. అప్పటివరకు అదే ఇంట్లో తమతో కలసిమెలసి ఉన్న వ్యక్తి చనిపోతే ఇంటికి రానివ్వకుండా అడ్డుకునే హక్కు ఇంటి యజమానికి లేదు అని చట్టం తెలియచేస్తుంది. జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో మరణం తర్వాత కూడా పార్ధివ శరీరాలకు ధర్మనిష్టా ప్రకారం స్వేచ్ఛగా ఖననం చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది.
మరణానంతర హక్కులు
మరణించిన తరువాత పార్ధీవ శరీరాలకు జరగాల్సిన కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరగాలి. అలా కాకుండా అడ్డుకుంటే హక్కులు కాలరాసినట్లే లెక్క .అలాంటి పని ఎవరు చేసినా హక్కుల ఉల్లంఘన జరిగింది అని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ లీజ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్టు 1960 ప్రకారం అద్దెకు ఉండే వారికి కొన్ని చట్టపరమైన హక్కులు కల్పించారు. ఇందులో జీవించే, మరణానంతరం కర్మలకు సంబంధించిన హక్కులున్నాయి.ఇంటి యజమాని తో సమానమైన హక్కులు ఆ భవనంలో నివసించే అద్దెదారులు కూడా కలిగి ఉంటారు.
తాము నివసించే భవనంలో యజమానికి ఎలాంటి వసతులుంటాయో, స్వేచ్ఛ ఉంటుందో అదే స్వేచ్ఛ అద్దెకి ఉండే వారికి కూడా వర్తిస్తుంది.అద్దెకు ఉంటున్న వారి కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఇంట్లో కి రానివ్వకుండా మృతదేహాన్ని అడ్డుకునే అధికారం యజమానికి ఉండదని న్యాయ నిపుణులు తెలియచేస్తున్నారు.
సొంత ఇల్లు, అయినవారు లేని సమయంలో అద్దెకు ఇచ్చిన భవన యజమాని కుటుంబం, చుట్టుపక్కల నివసించే వారి సహకారంతో ధర్మనిష్టా ప్రకారం ఖననం చేసుకోవచ్చని చట్టం తెలియచేస్తుంది. వీటిని ఉల్లంఘిస్తే అది చట్టవిరుద్ధం మవుతుంది.అనాధ ప్రేత సంస్కారం చేసిన, శవానికి ఆశ్రయం ఇచ్చిన,అంత్యక్రియలలో పాల్గొన్న,శవాన్ని మోసిన అత్యంత పుణ్యప్రదం అని మన శాస్త్రాలు సైతం తెలియచేస్తున్నాయి